ముమ్మాటికీ.. జగన్ సర్కారే హత్యలు.. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యలు బాధాకరం..
ముమ్మాటికీ.. జగన్ సర్కారే హత్యలు.. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యలు బాధాకరం..
బీసీలంతా సీఎం జగన్ ని వ్యతిరేకించాలి.. (శింగనమల నియోజకవర్గం )
వైసిపి దాష్టీ కానికి ఓ చేనేత కుటుంబం బలైంది. కడప జిల్లాలో ఒంటిమిట్ట గ్రామంలో జరిగిన ఘటనకు ఘటన ఇది ఆత్మహత్యలు కాదు... ముమ్మాటికీ జగన్ సర్కారే చేసిన హత్యనేనని సింగనమల నియోజకవర్గం టిడిపి నేతలు ఆరోపించారు.
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట కొత్త మాధవరంలో రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై సింగనమల నియోజకవర్గం టూ మెన్ కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమడు కేశవరెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యనిర్వ కార్యదర్శి రామలింగారెడ్డి జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పసుపుల హనుమంతురెడ్డి ,జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు , కన్వీనర్ అశోక్ స్పందించారు. ఆదివారం బుక్కరాయసముద్రం పెద్దమ్మ గుడి సర్కిల్ వద్ద కొవ్వొత్తులు తో ర్యాలీ చేసి వారి కుటుంబానికి శ్రద్ధాంజలి ప్రకటించి అనంతరం మాట్లాడారు .ప్రభుత్వ దాష్టీకానికి ఓ చేనేత కుటుంబం బలైపోయిందని ఆరోపించారు. వైసీపీ నేతల కబ్జాకాండ నిండు కుటుంబం ఉసురు తీసిందని టీడిపి నేతలు ఆరోపించారు. కబ్జారాయుళ్లతో పోరాడలేక బీసీ కుటుంబం ప్రాణాలు తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాటలకందని విషాదం ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోందని తెలిపారు. కొత్త మాధవరంలో జరిగిన ఈ ఘటనకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు? ఎంత ఆవేదన చెందితే ఇలా ప్రాణాలు తీసుకుంటారో తెలుసా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై స్పందించి ఆత్మహత్య కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగనమల నియోజకవర్గం టిడిపి నేతలు డిమాండ్ చేశారు.
వైసీపీ నేతల భూ కబ్జాలకు కుటుంబం బలి నియోజవర్గం టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కొత్త మాధవరంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం పట్ల టీడీపీ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాల సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వారి భూమిని కబ్జా చేయడంతోనే ఆ చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యేనని ధ్వజమెత్తారు. ఈ మేరకు పాల సుబ్బారావు కుటుంబానికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బండారు శ్రావణి శ్రీ డిమాండ్ చేశారు. బీసీలపై జగన్ అండతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ మూకలను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని నియోజవర్గం టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ డిమాండ్ చేశారు
Mar 25 2024, 07:47